వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్ గర్ల్‌పై రేప్: ఏడాదిన్నర తర్వాత నిందితుడి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gang Rape
గయా: ఓ జపాన్ అమ్మాయిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఏడాదిన్నర తర్వాత ఓ నిందితుడిని అరెస్టు చేయగలిగారు. బీహార్‌లో బుద్ధ గయాను చూడడానికి వెళ్తున్న జపాన్ అమ్మాయిపై 2010లో సామూహిక అత్యాచారం జరిగింది. దర్యాప్తు అనంతరం పోలీసులు ఏడాదిన్నర తర్వాత ఆ కేసులో ఓ నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రంజన్ యాదవ్ అనే నిందితుడు ఫరైయా పోలీసు స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డాడు.

జపాన్‌కు చెందిన 24 ఏల్ల నోమురా భారత సందర్శనకు వచ్చింది. ఆమె నిరుడు ఏప్రిల్ 16వ తేదీన గయా నుంచి బుద్ధ గయాకు ప్రయాణిస్తుండగా ఐదుగురు వ్యక్తులు దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సంఘటన జరిగిన పది రోజుల్లోనే పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఆ ముగ్గురిని కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. శుక్రవారం యాదవ్ పట్టుబడడంతో కేసు దర్యాప్తు కాస్తా ముందుకు కదిలింది. ఐదో నిందితుడు అరెస్టయిన తర్వాతనే కేసు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.

English summary
A Japanese girl was gang-raped in 2010 when she was on her way to visit Bodh Gaya in Bihar. After a minute investigation, police arrested the main accused almost one and a half year after the incident from the same place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X