వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపి, టిఆర్ఎస్ బినామీలకు టెండర్లు: శంకర్ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనేతలు, కెవిపి రామచంద్రా రావు బినామీలకు పోలవరం టెండర్లు దక్కాయని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు శుక్రవారం ఆరోపించారు. పోలవరం టెండర్లలో తీవ్ర అవకతవకలు జరిగాయన్నారు. దీనిపై తాను అవసరమైతే హైకోర్టుకు వెళతానని శంకర్ రావు చెప్పారు. పోలవరం టెండర్లు చివరి రోజు ష్యూ కంపెనీకి దక్కడంపై పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి టెండర్ల కేటాయింపు జరిగిందని ఆయన ఆరోపించారు.

ఈ టెండర్ల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అందుకే తాను ఈ వ్యవహారంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురు పార్టీ అగ్రనేతలకు లేఖ రాసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయి వరకు పలువురు సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయన్నారు.

English summary
Minister Shankar Rao accused KVP Ramachandra Rao and TRS leaders in Polavaram issue. He said he will go to high court on project contract issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X