వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది: మందా జగన్నాథం
తెలంగాణ కోసం రాజీనామా చేస్తానని జూపల్లి కృష్ణారావు ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ యువకుల శవాల మీద ప్రమాణం చేశారని, అలా ప్రమాణం చేసిన తర్వాత పదవిలో కొనసాగడం, పార్టీలో కొనసాగడం చాలా కష్టంగా ఉందనీ ఒత్తిడికి గురవుతున్నానని జూపల్లి చెప్పారని, అందుకే జూపల్లి రాజీనామా చేసి ఉంటారని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ కోసం ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, ఆ ఒత్తిడి కారణంగా రాజయ్య రాజీనామా చేసి ఉంటారని ఆయన అన్నారు. పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తమ పార్టీ అధిష్టానం తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Comments
English summary
Congress MP from Telangana, Manda Jagannatham said that the resignation will a threat ti state government survival.
Story first published: Sunday, October 30, 2011, 13:44 [IST]