విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంత మంది వెళ్లినా కాంగ్రెసుకు నష్టం లేదు: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: తమ పార్టీ నుంచి ఎంత మంది వెళ్లిపోయినా నష్టం లేదని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తమ పార్టీ నుంచి ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి వెళ్లారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ అంచనా వేసినదాని కన్నా తక్కువ మందే వెళ్లిపోయారని ఆయన అన్నారు. ఇద్దరు పార్లమెంటు సభ్యులు, ఐదుగురు శాసనసభ్యులు పార్టీ నుంచి వెళ్లిపోతారని ముందుగానే తెలుసునని ఆయన అన్నారు. మరో ముగ్గురు శాసనసభ్యులు తమ పార్టీని వీడినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పు లేదని ఆయన అన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి అనేక కారణాలుంటాయని ఆయన అన్నారు.

కాంగ్రెసుకు చెందిన మరో ముగ్గురు పార్లమెంటు సభ్యులు, ముగ్గురు శానససభ్యులు రాజీనామాలు చేస్తారనేది అవాస్తవమని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన అన్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెసు పార్టీ కనుమరుగవుతుందనేది అబద్ధమని ఆయన అన్నారు. జాతీయ పార్టీ అయిన కనుమరుగవుతుందని ఓ ఉప ప్రాంతీయ పార్టీ చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. తెరాస శాసనసభ్యులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి ఓటేయలేదని ఆయన అన్నారు.

English summary
Congress Vijayawada MP Lagadapati Rajagopla said that there is no loss to his party with 3 MLAs resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X