వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారు వారు ఒకటి: కోదండరామ్ పై మందకృష్ణ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
న్యూఢిల్లీ: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ పై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బుధవారం న్యూఢిల్లీలో తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షకు మద్దతు పలికిన కోదండరామ్ బిసి నేత అయిన బాపూజీ దీక్షను స్వాగతిస్తున్నట్లు మాత్రమే ప్రకటించారన్నారు. వారు వారు రెడ్లు కాబట్టి మద్దతు పలికారని అణగారిన వర్గాల దీక్షలకు మాత్రం మద్దతు పలకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణపై కేవలం రాజకీయ శక్తులతో మాత్రమే చర్చలు జరిపి ఊరుకోవద్దని సామాజిక శక్తులతోనూ చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

రాజకీయ పార్టీలు సామాజిక శక్తులను అణగదొక్కాలని చూస్తున్నాయన్నారు. బాపూజీ దీక్షకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మద్దతు ప్రకటించక పోవడం దారుణమన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలి, కానీ ఈ ప్రాంతంలోని అణగారివర్గాల ఆకాంక్షలను, సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

English summary
MRPS president Manda Krishna Madiga fired at Telangana JAC chairman Kodandaram today in New Delhi. He appealed central government that talk with BC, ST and SCs on Telangana but not only political parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X