గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబే జగన్ టార్గెట్, రైతు పోరుపై వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. పదవి కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో 17 రోజుల పాటు సాగించిన మొదటి విడత ఓదార్పు యాత్రను ఆయన బుధవారం సాయంత్రం ముగించారు. ఈ సందర్భంగా ఆయన రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. విశ్వసనీయత అనగానే వైయస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తారని, కుతంత్రం అనగానే చంద్రబాబు గుర్తొస్తారని ఆయన అన్నారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అన్నదాతను వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడ్డారని ఆయన అన్నారు. చంద్రబాబునే వైయస్ జగన్ తన ప్రసంగంలో ప్రధానంగా టార్గెట్ చేశారు. చంద్రబాబు చేపట్టిన రైతు పోరు బాటపై జగన్ వ్యాఖ్యలు చేశారు.

నష్టపరిహారం కోసమే రైతులు మరణిస్తున్నారని అన్న చంద్రబాబు ఇప్పుడు కరవు యాత్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలపై, ప్రజా సమస్యలపై చంద్రబాబు సానుభూతి లేదని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు మద్యనిషేధం విధిస్తే చంద్రబాబు పల్లెపల్లెనా బెల్టు షాపులు పెట్టారని ఆయన విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అన్నదాతను ఉద్ధరిస్తానని అంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కయిన విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెసులకు డిపాజిట్లు కూడా రావని ఆయన అన్నారు. చంద్రబాబు ఏనాడైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పేద విద్యార్థుల కష్టాలు తెలుసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు.

English summary
YSR Congress party president YS Jagan targeted TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X