తెలంగాణ సోనియాకు అగ్ని పరీక్ష: జీవన్ రెడ్డి
పోలీసులతో ఉద్యమాన్ని అణిచి వేయలేరని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షా శిబిరంలో అన్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వకుంటే పార్లమెంటు సెషన్లు అడ్డుకుంటామన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆగే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ మంత్రులు కేవలం ప్రకటనలకే పరిమితవుతున్నారని మరో ఎంపీ రాజయ్య ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధిస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రకటించాలన్నారు. 1969 నాటి ఉద్యమం ఇప్పుడు కాదన్నారు. మభ్య పెట్టాలని చూసినా అలాంటి వారెవరు ఇప్పుడు లేరన్నారు.
కాంగ్రెసు తెలంగాణ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో కనుమరుగు కావడం ఖాయమని ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్య అన్నారు. తాము తెలంగాణ రాష్ట్రం కొత్తగా అడగటం లేదని గతంలో ఉన్నదానినే అడుగుతున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతూ అన్నారు. తనకు ఇంతగా మద్దతు రావడం చూస్తుంటే ఉత్సాహం పెరిగి పట్టుదల పెరుగుతోందన్నారు. తనను అరెస్టు చేసినా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. కాగా కోమటిరెడ్డి దీక్ష గురువారం మూడో రోజుకు చేరుకుంది.