వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనిమొళి బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi
న్యూఢిల్లీ: జైలు నుంచి బయటపడాలనే డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళి ఆశలు వమ్మయ్యాయి. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళి బెయిల్ పిటిషన్‌ను కోర్టు గురువారం తోసిపుచ్చింది. ఆమెతో పాటు మరో ఏడుగురి బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది. విచారణను కోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. కనిమొళి గురువారం ఉదయం ఢిల్లీ కోర్టులో తన తల్లిని, భర్తను, కుమారుడిని కలుసుకున్నారు. గత ఐదు నెలలుగా కనిమొళి జైలులోనే ఉంటున్నారు.

తన బెయిల్ దరఖాస్తుపై న్యాయమూర్తి నిర్ణయాన్ని వినడానికి కనిమొళి గురువారం ఉదయం తీహార్ జైలు నుంచి పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకున్నారు. న్యాయమూర్తి నిర్ణయం వినడానికి సినీ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ, డిఎంకె నేత టిఆర్ బాలు కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి శుభవార్త వస్తుందని వేచి చూసిన డిఎంకె కార్యకర్తలకు నిరాశే ఎదురైంది.

English summary
A Delhi court dismissed the bail pleas of DMK MP Kanimozhi and seven other accused in the 2G spectrum allocation case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X