హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎంపీలది హడావుడే: అనంత వెంకట్రామిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantha Venkatrami Reddy
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమంటూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు చేసేది కేవలం హడావుడి మాత్రమేనని అనంతపురం జిల్లా పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి గురువారం హైదరాబాదులో అన్నారు. వారి హడావుడి ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం ఎప్పటికీ సమైక్యాంగానే ఉంటుందని విడిపోయే ప్రసక్తి లేదన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతు పోరు యాత్ర పేరుతో రాజకీయ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. కరవు యాత్రలో బాబు పైశాచికత్వాన్ని పొందుతున్నారన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్రం ఎప్పటికీ సమైక్యంగానే ఉంటుందని మంత్రి శైలజానాథ్ వేరుగా అన్నారు. త్వరలో అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
MP Anantha Venkatrami Reddy accused Telangana region MPs for their agitation. He hoped that state will not divided.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X