వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్ష్యం చెప్పడానికే సిబిఐ ముందుకు జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్: సిబిఐ ముందు రేపు శుక్రవారం తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారిక ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ చెప్పారు. కేవలం సాక్ష్యం చెప్పడానికి మాత్రమే జగన్ సిబిఐ ముందు హాజరవుతున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇంతకు ముందు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సాక్షిగా సిబిఐ సంబంధిత సెక్షన్ కింద ప్రశ్నించారని, అదే రీతిలో వైయస్ జగన్‌ను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తారని ఆయన అన్నారు.

వైయస్ జగన్‌కు సిబిఐ నోటీసు జారీ చేయడం, సిబిఐ ముందుకు వైయస్ జగన్ వెళ్తుండడాన్ని కొందరు గోరంతను కొండంతలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌ను సిబిఐ పిలవడం కాంగ్రెసు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా విషప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ఎలాంటి అపోహలను నమ్మాల్సిన పని లేదని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. వైయస్సార్ కుటుంబంపై దుర్మార్గపు రాతలు రాస్తున్నారని ఆయన ఓ వర్గం మీడియాపై విరుచుకుపడ్డారు.

English summary
YSR Congress party leader Bajireddy Govardhan said that his party president YS Jagan is deposing before CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X