వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామలింగరాజుకు కండిషనల్ బెయిల్, మరో ఇద్దరికీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
న్యూఢిల్లీ: సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. రామలింగ రాజుతో పాటు ఆయన తమ్ముడు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాసుపోర్టు అధికారులకు స్వాధీనం చేయాలని, అలాగే కేసు విచారణ పూర్తి కానందున ట్రయల్ కోర్టుకు సహకరించాలనే షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం వారికి ఇచ్చింది. బెయిల్ రావడం రామలింగ రాజుకు ఊరట కలిగిందని చెప్పవచ్చు. రామలింగ రాజు సుమారు రెండున్నర సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడుపుతున్నాడు.

విచారణ పూర్తి కాకపోవడంతో ఆయన ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ కోర్టు నిరాకరిస్తూ వచ్చింది. శుక్రవారం కూడా సిబిఐ తమ విచారణ పూర్తి కాలేదని, బయటకు వెళితే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశాలున్నాయని కోర్టుకు విన్నవించారు. అయితే చాలాకాలం జైలులో ఉండటం, కేసు విచారణ పూర్తి కాకపోవడంతో బెయిల్ మంజూరు చేసింది. ఇంకా ఏడుగురు అధికారులు దర్యాఫ్తు చేయాల్సి ఉంది. దానిని త్వరగా పూర్తి చేయాలని డివిజన్ బెంచ్ సిబిఐని ఆదేశించింది.

English summary
Supreme Court gave conditional bail to Satyam Ramalinga Raju today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X