32 నెలల తర్వాత జైలు నుంచి 'సత్యం' రాజు విడుదల
రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, ఆడిటర్ వడ్లమాని శ్రీనివాస్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన మీడియాతోనే కాకుండా ఎవరితోనూ మాట్లాడకుండా కారులో ఎక్కి ఇంటికి వెళ్లిపోయారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు 2009 జనవరి 9వ తేదీన అరెస్టయ్యారు. 2009 సెప్టెంబర్ 7వ తేదీన అనారోగ్యంతో ఆయన హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేరారు. ఆ తర్వాత నవంబర్ 25వ తేదీన జైలుకు వెళ్లారు.
సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. రామలింగ రాజుతో పాటు ఆయన తమ్ముడు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాసుపోర్టులను అధికారులకు స్వాధీనం చేయాలని, అలాగే కేసు విచారణ పూర్తి కానందున ట్రయల్ కోర్టుకు సహకరించాలనే షరతులతో కూడిన బెయిల్ను సుప్రీం వారికి ఇచ్చింది.