తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయుర్వేదిక్ వర్సిటీ ఫైనలియర్ విద్యార్థిని అదృశ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirupati
చిత్తూరు/వరంగల్: తిరుపతిలోని తిరుమల తిరుపతి ఆయుర్వేద విశ్వవిద్యాలయం నుండి కృష్ణ స్వప్న అనే విద్యార్థిని ఆదివారం అదృశ్యమైంది. ఆమె ఎస్వీలో ఆయుర్వేదిక్ విద్యను అభ్యసిస్తోంది. ఆమె ఉంటున్న హాస్టల్ గదిలో ఆదివారం ఉదయం సూసైడ్ నోట్ దొరికింది. అందులో తాను జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతున్నానంటూ రాసినట్లుగా తెలుస్తోంది. ఆమె ఆయుర్వేదిక్ ఫైనలియర్ చదువుతోంది. కృష్ణ స్వప్న కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.

కాగా వరంగల్ జిల్లాలో ఓ వికలాంగురాలిపై కొందరు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వికలాంగురాలు మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజిఎం) హాస్పిటల్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. నిందితుల డిఎన్ఏ పరీక్షలకు కలెక్టర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

English summary
Sri Venkateshwara ayurvedhic University girl student disappeared at Tirupati. Police found suicide note at her hostel room
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X