వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ట్రైవ్యాలీ విద్యార్థులపై పిడుగు, వెళ్లిపోవాలని ఆదేశం
భారత ప్రభుత్వానికి వారు విజ్ఞప్తులు చేసుకోవడంతో అక్కడి ఎంబసీ రంగంలోకి దిగి, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది. ట్రైవ్యాలీ బాధిత విద్యార్థులందరికీ వేరే యూనివర్సిటీల్లో అడ్మిషన్లు కల్పిస్తామని హామీలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆ విద్యార్థులకు సంబంధించిన వివరాల పరిశీలనను కూడా చేపట్టారు. వారిలో దాదాపు 435మంది విద్యార్థులకు ఇతర యూనివర్సిటీల్లో చేరడానికి అమెరికా అధికారులు అనుమతి కూడా ఇచ్చారు. మిగతా వారి వివరాలను పరిశీలిస్తున్నట్లుగా ప్రకటించారు. దాంతో తమ ఇబ్బందులు తీరిపోయాయని సంతోషించిన ట్రైవ్యాలీ బాధిత విద్యార్థులకు ఆదివారంనాటి ఆదేశాలతో పిడుగు పడినట్లయింది.
Comments
English summary
USA government ordered Tri Valley students to leave the country.
Story first published: Monday, November 7, 2011, 10:01 [IST]