వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రైవ్యాలీ విద్యార్థులపై పిడుగు, వెళ్లిపోవాలని ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Tri Valley University
వాషింగ్టన్: ట్రైవ్యాలీ విద్యార్థులపై పిడుగు పడింది. మరోసారి వారి భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది. ఏదో ఒక విశ్వవిద్యాలయంలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులను దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. ఈ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు చేరిన విషయం తెలిసిందే. వీసాల అక్రమాలకు పాల్పడడంతో ఆ విశ్వవిద్యాలయాన్ని అమెరికా ప్రభుత్వం మూసివేయడంతో భారత విద్యార్థులు రోడ్డున పడ్డారు.

భారత ప్రభుత్వానికి వారు విజ్ఞప్తులు చేసుకోవడంతో అక్కడి ఎంబసీ రంగంలోకి దిగి, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది. ట్రైవ్యాలీ బాధిత విద్యార్థులందరికీ వేరే యూనివర్సిటీల్లో అడ్మిషన్లు కల్పిస్తామని హామీలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆ విద్యార్థులకు సంబంధించిన వివరాల పరిశీలనను కూడా చేపట్టారు. వారిలో దాదాపు 435మంది విద్యార్థులకు ఇతర యూనివర్సిటీల్లో చేరడానికి అమెరికా అధికారులు అనుమతి కూడా ఇచ్చారు. మిగతా వారి వివరాలను పరిశీలిస్తున్నట్లుగా ప్రకటించారు. దాంతో తమ ఇబ్బందులు తీరిపోయాయని సంతోషించిన ట్రైవ్యాలీ బాధిత విద్యార్థులకు ఆదివారంనాటి ఆదేశాలతో పిడుగు పడినట్లయింది.

English summary
USA government ordered Tri Valley students to leave the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X