మంత్రి శంకరరావుకు మల్కాజిగిరి కోర్టు షాక్
తాము చేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రీన్ఫీల్డ్ ప్రతినిధులు కోర్టుకెక్కారు. గ్రీన్ఫీల్డ్ ప్రతినిధుల ఫిర్యాదుపై కోర్టు స్పందిస్తూ శంకరరావుపై విచారణ జరిపించి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు శంకరరావుపై కేసు నమోదు చేశారు. కాగా, ఐఎఎస్ బదిలీల్లో కుల వివక్ష ఉందని, ప్రధానమైన పోస్టుల్లో అగ్రవర్ణాలవారిని వేసి ప్రాధాన్యం లేని పోస్టుల్లో దళితులను వేయాలని మంత్రి శంకరరావు విమర్శించారు. జరిగిన తప్పును ముఖ్యమంత్రి సరిదిద్దుకోవాలని ఆయన ప్రకాశం జిల్లాలో అన్నారు. దళితులకు ప్రధానమైన పోస్టులను ఇవ్వాలని ఆయన కోరారు.
Comments
shankar rao green field rangareddy district hyderabad శంకరరావు గ్రీన్ఫీల్డ్ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్
English summary
Malkajigiri court ordered police book case against minister P Shankar Rao.
Story first published: Wednesday, November 9, 2011, 16:21 [IST]