హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి శంకరరావుకు మల్కాజిగిరి కోర్టు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: కోర్టులను తన ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకుంటున్న మంత్రి శంకరరావుకు రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి కోర్టు షాక్ ఇచ్చింది. శంకరరావుపై విచారణ జరిపి, కేసు నమోదు చేయాలని కోర్టు బుధవారం నేరేడుమెట్ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద శంకరరావుపై కేసు నమోదు చేశారు. తమపై తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని గ్రీన్‌ఫీల్డ్ ప్రతినిధులు నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాము చేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రీన్‌ఫీల్డ్ ప్రతినిధులు కోర్టుకెక్కారు. గ్రీన్‌ఫీల్డ్ ప్రతినిధుల ఫిర్యాదుపై కోర్టు స్పందిస్తూ శంకరరావుపై విచారణ జరిపించి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు శంకరరావుపై కేసు నమోదు చేశారు. కాగా, ఐఎఎస్ బదిలీల్లో కుల వివక్ష ఉందని, ప్రధానమైన పోస్టుల్లో అగ్రవర్ణాలవారిని వేసి ప్రాధాన్యం లేని పోస్టుల్లో దళితులను వేయాలని మంత్రి శంకరరావు విమర్శించారు. జరిగిన తప్పును ముఖ్యమంత్రి సరిదిద్దుకోవాలని ఆయన ప్రకాశం జిల్లాలో అన్నారు. దళితులకు ప్రధానమైన పోస్టులను ఇవ్వాలని ఆయన కోరారు.

English summary
Malkajigiri court ordered police book case against minister P Shankar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X