వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ద్రోహి అంటూ వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy's Statue
వరంగల్: జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. దివంగత వైయస్సార్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు కూల్చి వేశారు. కూల్చి వేసిన చోట ఓ పోస్టరు అతికించారు. స్వాతంత్రం తీసుకు వచ్చిన మహానుభావులైన సుభాష్ చంద్ర బోసు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలు పెట్టకుండా తెలంగాణ ద్రోహి ఐన వైయస్ విగ్రహం పెట్టడం ఏమిటంటూ పోస్టర్ అంటించారు. దీంతో వైయస్సార్ అభిమానులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వైయస్ విగ్రహాన్ని కూల్చి వేయడం పట్ల వైయస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ తెలంగాణ ద్రోహి కాదన్నారు. ఆయన విగ్రహాన్ని కూల్చితే తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. దివంగత నేత విగ్రహాన్ని కూల్చిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

English summary
Unknown perons destroyed late YS Rajasekhar Reddy statue today in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X