అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాస్తవాలు వెల్లడిస్తా: సత్య సాయి భాబా భక్తుడు టైగ్రెట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: అమెరికాకు చెందిన పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తుడు ఐశాక్ టైగ్రేట్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్య సాయిబాబా తనతో చర్చించిన విషయాలను ఈ నెల 23వ తేదీలోగా వెల్లడిస్తానని ఆయన చెప్పారు. తెల్ల కాగితాలపై సత్య సాయిబాబా స్వయంగా గీసిన స్కెచ్‌లను ఆయన బయటపెట్టారు. ప్రత్యేకంగా సంభాషించే అవకాశాన్ని అనేక సార్లు బాబా తనకు కల్పించారని, ఈ క్రమంలో బాబు సంస్థల భవిష్యత్తు ప్రణాళికపై తనతో బాబా చర్చించారని ఆయన అన్నారు. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న టైగ్రేట్ ఆయన ఈ మెయిల్ ద్వారా ఆ విషయాలను బయటపెట్టారు.

వేయి కాళ్ల మంటపం తరహాలో ప్రశాంతి నిలయంలో ఆలయాలు నిర్మించాలని బాబా తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. అటువంటి స్కెచ్‌లను వేసి బాబా తనకు చూపించారని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుందరంగా ప్రశాంతి నిలయం ఉండాలని, అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి తన సందేశాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారని ఆయన అన్నారు. సత్య సాయి సంస్థలను భవిష్యత్తులో ఎలా నిర్వహించాలనే దానిపై నిర్దిష్ట ప్రణాళికను బాబా రూపొందించారని ఆయన అన్నారు. గతంలో టైగ్రేట్ పలు విషయాలు చెప్పారు.

English summary
Sathya Sai Baba devotee Ishak Tigrate said that he will reveal all issue before November 23.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X