వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు: శైలజానాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తామని ఏరోజూ చెప్పలేదని మంత్రి శైలజానాథ్ ఆదివారం హైదరాబాదులో అన్నారు. అవేశకావేశాలతో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు సాధ్యం కాదన్నారు. దేశ ప్రజల సంక్షేమం, బాధ్యతకు తెలంగాణపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటన నిదర్శనమన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ తనకు తోచింది మాట్లాడుతున్నారన్నారు. అయినా ఆయన వ్యాఖ్యలపై మాట్లాడే స్థాయి తనకు లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి టన్నుల కొద్ది నివేదికలు ఇచ్చింది తెలంగాణ వాళ్లే వ్యతిరేకించిందీ వాళ్లేనని విమర్శించారు. మేం వాస్తవాలు మాట్లాడుతున్నామని చెప్పారు. కాగా శనివారం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తెలంగాణ సమస్యను ఇప్పటికిప్పుడు తేల్చలేమని చెప్పిన విషయం తెలిసిందే.

English summary
Minister Sailajanath said today that Congress did not promised for Telangana before.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X