తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామాలు ఆమోదించాలి: జగన్ నేత డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
తిరుపతి: రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి ఇవే చివరి సమావేశాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్ రావు ఆదివారం తిరుపతిలో అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కష్టాల్లో ఉందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెసు ప్రభుత్వ భవితవ్వం తేలనుందన్నారు. వైయస్సార్ పేరును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఛార్జీషీటులో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ 29 మంది తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారని, వారు తమ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారని చెప్పారు. వారి రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు ఆమోదించే విచక్షణాధికారం స్పీకర్‌కు సంబంధించిందన్నారు.

టిడిపి ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేసిన నాగం జనార్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామాలు ఆమోదించిన స్పీకర్ చిత్తశుద్ధి ఉంటే మిగిలిన జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఆ ఎమ్మెల్యేలందరూ జగన్ వెంటే ఉన్నారన్నారు. తెలంగాణపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటన ఆయన చేతకానితనం, అసమర్థత తెలియజేస్తున్నాయని మరో నేత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అగ్నిగుండంలో మార్చేశాయని విమర్శించారు.

English summary
YSRC Party leader Jupudi Prabhakar Rao demanded speaker Nadendla Manohar to accept Jagan camp mlas resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X