విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీట మునిగి జార్ఖండ్‌లో తెలుగు విద్యార్థుల దుర్మరణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

andhra pradesh
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో జలపాతం కింద స్నానం చేస్తూ నీట మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు ఆదివారం దుర్మరణం చెందారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో విహార యాత్రకు వెళ్లారు. విద్యార్థులు ధన్‌బాద్ సమీపంలోని జలపాతం క్రింద స్నానం చేస్తుండగా అశోక్ అనే విద్యార్థి నీటిలో మునిగి పోయాడు. అతడిని రక్షించే ప్రయత్నంలో గౌతం అనే విద్యార్థి కూడా నీటిలో మునిగి పోయాడు.

వీరి మృతదేహాలు సోమవారం ఉదయం దొరికాయి. పోలీసులు నిన్నటి నుండే మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మృతి చెందిన ఇద్దరూ తెలుగు వారే. గౌతమ్ కూకట్‌పల్లికి చెందిన విద్యార్థి కాగా అశోక్ కృష్ణా జిల్లా విజయవాడలోని గవర్నర్‌పేటకు చెందిన విద్యార్థి.

English summary
Two telugu studens died in Jarkhand state. They are studying in Indian School of Mins.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X