కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేమంతా జగన్ వెంటే: ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool District
కర్నూలు: సిబిఐ ఎఫ్ఐఆర్‌లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరసనగా రాజీనామాలు చేసిన శాసనసభ్యులంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంటే ఉంటారని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శాసనసభ్యుడు చెన్నకేశవ రెడ్డి అన్నారు. రాజీనామాలు చేసిన శాసనసభ్యులు తిరిగి వస్తారనే కాంగ్రెసు పార్టీ ప్రచారంలో నిజం లేదని, కాంగ్రెసు నేతలు కుట్రపూరితంగా ఆ ప్రచారం సాగిస్తున్నారని ఆయన కోడుమూరులో మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము రాజీనామాలకే కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ధైర్యం ఉంటే తమ రాజీనామాలను ఆమోదించాలని ఆయన సవాల్ చేశారు. రాజీనామాలను ఆమోదిస్తే తాము వైయస్సార్ కాంగ్రెసు తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు మట్టికొట్టుకుపోవడం ఖాయమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం నెలకొందని, దాన్ని పట్టించుకునే పాలకులే లేకుండా పోయారని ఆయన అన్నారు.

English summary
YSR Congress party president YS Jagan camp MLA Chennakesava Reddy clarified that they will not desert YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X