వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం రచ్చబండ సభలో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
ఏలూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు ఆళ్ల నాని పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంగళవారం జరిగిన సభలో ఆయన పాలు పంచుకున్నారు. రచ్చబండకు కూడా ఆళ్ల నాని ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి. రచ్చబండ ప్రసంగంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు మూడు సార్లు ఆళ్ల నాని పేరు ప్రస్తావించి ఆయనను సంతోషపెట్టే పని చేశారు. కళాశాల భవనం అదనపు గదుల నిర్మాణానికి ఆళ్ల నాని నిధులు అడిగిన వెంటనే కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆళ్ల నాని కోరికలను అన్నింటినీ తీర్చడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు, ఏలూరుకు ముఖ్యమంత్రి వరాల వర్షం కురిపించారు.

నిత్యావసర ధరల పెరుగుదలను నియంత్రించడానికి పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో ముడిపడి ఉన్నందు వల్లనే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరల నుంచి రూపాయికి కిలో బియ్యం ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు. ధాన్యానికి మద్దతు ధర పెంచాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
YSR Congress party president YS Jagan camp MLA Alla Nani participated in CM's Rachabanda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X