వైయస్ జగన్ పార్టీకే భవిష్యత్తు ఉంటుంది: సబ్బం హరి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అవినీతి బురదలో కూరుకుపోయి ఉన్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. చంద్రబాబుకు మరొకరు బురద పూయాల్సిన అవసరం లేదని ఆయన హైదరాైబాదులో మీడియా ప్రతినిధల సమావేశంలో అన్నారు. కోర్టుకు, కేంద్రానికి చంద్రబాబు లింక్ పెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎల్లో మీడియా వైయస్ రాజశేఖర రెడ్డిపై తప్పుడు రాతలు రాస్తోందని ఆయన మండిపడ్డారు. ఈనాడు అధిపతి రామోజీరావుకు శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో వందలాది ఎకరాల భూమి ఉందా, లేదా అని ఆయన అడిగారు.
దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ వచ్చే శాసనసభా సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆయన సవాల్ చేశారు. ఇద్దరం కలిసి ఈ ప్రభుత్వాన్ని దింపుదామని ఆయన తెలుగుదేశం పార్టీకి పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం ఉండాల్సిన అవసరం లేదని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో పార్టీ మరో అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కూడా పాల్గొన్నారు.