రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దూకుడు కోసం చెప్పకుండానే విశాఖ టు రాజమండ్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dookudu
విశాఖపట్నం: మహేష్ బాబు నటించిన దూకుడు చిత్రాన్ని చూడటానికి ముగ్గురు విద్యార్థినులు ఎవరికీ చెప్పకుండానే విశాఖపట్నం నుండి రాజమండ్రికి వెళ్లిన సంఘటన తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. విశాఖలో జిల్లాలోని ఓ స్కూల్ చదువుతున్న సాయి గీతిక, సంజన, అనూష అనే ముగ్గురు ఆరో తరగతి విద్యార్థినులు దూకుడు చిత్రం చూడాలని అనుకున్నారు. అయితే స్థానికంగా చూస్తే ఎవరైనా తమ తల్లిదండ్రులకు చెబుతారనుకున్నారో మరో కారణమో గానీ బుధవారం పాఠశాల నుండి నేరుగా విశాఖ నుండి రాజమండ్రికి ఓ రైలులో వెళ్లారు.

రాత్రి అయినా తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. పాఠశాల యాజమాన్యంతో కలిసి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి సమయంలో వారు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లోని సిసి కెమెరాల ద్వారా వారు అక్కడే ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి వారిని తీసుకొని వచ్చారు. పిల్లలు దొరకడంతో తల్లిదండ్రులు ఆనందంలో తేలియాడగా ఆరో తరగతి పిల్లలు అంత దూరం వెళ్లడం చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు.

English summary
Three girl students went to Rajahmundry from Vishakapatnam to see Dookudu film without any information to parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X