వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్‌ను కలిసిన వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla manohar
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ముగ్గురు కాంగ్రెసు శాసనసభ్యులు గురువారం శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఉదయం పూట స్పీకర్‌ను కలవగా, శివప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి సాయంత్రం కలిశారు. వారు స్పీకర్‌తో ఏం మాట్లాడారనే విషయం తెలియదు. వారెవరు కూడా మీడియాతో మాట్లాడలేదు. తన వద్ద పెండింగులో రాజీనామాలను పరిష్కరించే పనిలో స్పీకర్ పడ్డారు. డిసెంబర్ 1వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా వాటిని పరిష్కరించాలని ఆయన అనుకుంటున్నారు. ఈ స్థితిలో వారు ముగ్గురు స్పీకర్‌ను కలిశారు.

సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరసనగా రాజీనామాలు చేసిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ఈ ముగ్గురు ఉన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారు రాజీనామాలు చేశారు. అయితే, జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యుల్లో కొంత మంది శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసు వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారని, కాంగ్రెసు నాయకులతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ రాజీనామాలను అంగీకరిస్తారనే భయం కొద్ది కాస్తా సమయం ఇవ్వాలని కోరడానికో, రాజీనామాలను ఆమోదించవద్దని చెప్పడానికో వారు స్పీకర్‌ను కలిశారనే పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.

English summary
YSR congress party president YS Jagan camp MLAs Ramakrishna Reddy, Sivaprasad Reddy and Amarnath Reddy met speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X