వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేలు సొంతగూటికి తిరిగొస్తారు: శైలజానాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanath
తిరుపతి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న తమ పార్టీ శాసనసభ్యులు అందరూ సొంతగూటికి తిరిగి వస్తారని మంత్రి సాకె శైలజానాథ్ ఆదివారం చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా ఎలాంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. చంద్రబాబు అవిశ్వాసం పెడితే ఎదుర్కొంటామని దానిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న కాంగ్రెసు పార్టీకి ఇదో లెక్క కాదన్నారు.

ప్రత్యేక రాష్ట్రాల విషయంలో భారతీయ జనతా పార్టీది రెండు నాల్కల ధోరణి అని ధ్వజమెత్తారు. ఆ పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ అని ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఒక జాతీయ నాయకుడు ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

English summary
YSRC Party president YS Jaganmohan Reddy camp MLAs will returned soon, said minister Sake Sailajanath today in Tirupati. He accused BJP for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X