పార్లమెంటులో చిదంబరానికి బహిష్కరణ సెగ, కాంగ్రెసు వ్యూహం
కాగా, తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పార్లమెంటును స్తంభింపజేస్తామని చెప్పారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెసు కోర్ కమిటీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో సమావేశమైంది. ఈ సమావేశానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా హాజరయ్యారు. తెలంగాణపై అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తెరాసకు చెందిన ఇద్దరు లోకసభ సభ్యులు తెలంగాణ అంశాన్ని లేవనెత్తితే తమ పార్టీ తెలంగాణ సభ్యులు ఎలా వ్యవహరిస్తారనే విషయంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి అనుసరించే వైఖరిపై కూడా చర్చ చేసి, తాము అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
నల్లధనం, 2జి స్పెక్ట్రమ్ స్కామ్, ఉత్తరప్రదేశ్ విభజన వంటి అంశాలతో ప్రతిపక్షాలు తమను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవచ్చునని కాంగ్రెసు భావిస్తోంది. బిఎస్పి సభ్యులు ఉత్తరప్రదేశ్ విభజనకు శాసనసభ సమావేశం తీర్మానాన్ని ప్రస్తావిస్తే ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా ప్రధానంగా కోర్ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది.