విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్‌కు రుణపడి ఉండాలి: టిడిపి ఎమ్మెల్యే ప్రశంసలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
విజయవాడ: గుడివాడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నాని మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించారు. విజయవాడలో మంగళవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెసు నేతలు స్థానిక ఎమ్మెల్యే నానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నాలు చేశారు. దీనిని టిడిపి వర్గాలు అడ్డుకున్నాయి. ఇరువర్గాలు మధ్య మాటా మాటా పెరిగి రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చ అయింది. ఇరు పార్టీల కార్యకర్తలు కుర్చీలతో పరస్పర దాడులకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ స్థానిక కాంగ్రెసు నేత పిన్నమనేని గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి నిరోధకుడు అని ధ్వజమెత్తారు. నియోజకవర్గ ప్రజలు రుణపడాల్సింది దివంగత టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికేనని అన్నారు. గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని పిన్నమనేనికి సవాల్ విసిరారు.

English summary
TDP Gudiwada MLA Nani praised late YS Rajasekhar Reddy in Rachabanda programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X