వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాపూజీ యాత్రలో ఎర్రబెల్లి, కెకె, బిల్లు పెట్టాలని డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Laxman Bapuji
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రముఖ స్వతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గురువారం ఇండియా గేట్ నుండి తన పాదయాత్రను ప్రారంభించారు. ఆయనకు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బాపూజీ మాట్లాడారు. గత డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఈ శీతాకాల సమావేశాలలోనే కేంద్రం తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన తన పాదయాత్రను ఇండియా గేట్ నుండి పార్లమెంటు వరకు చేపట్టనున్నారు. అక్కడ స్పీకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ పాదయాత్రలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, వివేక్, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేశవరావు, టిడిపి నేతలు గుండు సుధారాణి, ఎర్రబెల్లి దయాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

English summary
Congress senior leader K Keshav Rao and TDP senior MLA Errabelli Dayakar Rao participated in Konda Laxman Bapuji padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X