వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ఏడాది కావాలని అడిగా: మేయర్‌పై బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: మేయర్ పదవిని తమకు మరో ఏడాది ఇలాగే పొడిగించాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని తాను కోరినట్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం చెప్పారు. బొత్స మధ్యాహ్నం ఎంఐఎం నేతలతో మేయర్ పదవిపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒప్పందం ప్రకారం చివరి సంవత్సరం మేయర్ పదవి మాకు రావాల్సి ఉందని అది ఇప్పుడే తమకు ఇవ్వాలని అక్బరుద్దీన్‌ను తాము కోరామని చెప్పారు. డిసెంబర్ 4న తమ పదవి కాలం ముగిసి పోతుందని చెప్పారు. ముఖ్యమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. జగన్ వర్గం ఎమ్మెల్యే కొర్ల భారతి కాంగ్రెసులోనే కొనసాగుతానని తనతో చెప్పారన్నారు.

కాగా మరో సంవత్సరం మేయర్ పదవిని పొడిగించేందుకు ఎంఐఎం ఒప్పుకోనట్లుగా సమాచారం. ప్రస్తుతం మేయర్‌గా కొనసాగుతున్న బండ కార్తీక రెడ్డి రాజీనామాకు వెనక్కి వెళుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బొత్స కొనసాగింపు కోసం ఎంఐఎంను అడిగినట్లుగా తెలుస్తోంది. ఎంఐఎం మాత్రం అందుకు అంగీకరించేది లేదని ఒప్పందం ప్రకారమే అంతా జరగాలని బొత్సకు చెప్పారట.

English summary
PCC chief Botsa Satyanarayana talk about Hyderabad mayor post with MIM MLA AKbaruddin Owaisi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X