వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిషన్‌జీ భార్యా మావోయిస్టే, ఆమెపై పది లక్షల రివార్డు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishenji
మహబూబ్‌నగర్: పశ్చిమ బెంగాల్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావు భార్య కూడా ప్రముఖ మావోయిసస్టే. ఆయన భార్య పద్మావతి అలియాస్ మైనా అలియాస్ కల్పన అలియాస్ సుజాతక్క అలియాస్ మణికక్ మహబూబ్‌నగర్ జిల్లా వాసి. గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన పటేల్ తిమ్మారెడ్డి, వెంకమ్మల రెండో సంతానం. 1982-83లో పద్మ గద్వాలలో మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ కళాశాలలో ఇంటర్ చదివేది. గద్వాలలో అప్పటి పీపుల్స్‌వార్ భావజాలంతో పనిచేస్తున్న పటేల్ సుధాకర్‌రెడ్డి ప్రభావం ఆమెపై పడింది. మొదట తెల్కపల్లి దళంలో సభ్యురాలిగా చేరింది. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, దండకారణ్యం సౌత్ జోన్ కమిటీలో సభ్యురాలి స్థాయికి చేరింది.

నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లిన పద్మ 30 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉంటోంది. 1987లో ఆమెకు మల్లోజుల కోటేశ్వర్‌రావుతో వివాహం జరిగింది. తండ్రి తిమ్మారెడ్డి అనారోగ్యంతో మరణించినా కూడా ఆమె ఇంటికి వెళ్లలేదు. పోలీస్ రికార్డుల ప్రకారం పద్మపై రూ.10 లక్షల రివార్డు ఉంది. తెల్కపల్లి దళం నుంచి ప్రారంభమైన ఆమె ప్రస్థానం ప్రస్తుతం దండకారుణ్య సౌత్‌జోన్ కమిటీ స్థాయికి చేరింది.

English summary
Maoist leader Kishenji's wife Padma is also an underground Maoist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X