హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబూ! ఒక్కటంటే ఒక్కటి చూపించు: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తొమ్మిదేళ్ల పాలనలో రైతుల కోసం ఇదిగో ఇది చేశానని ఒక్కటంటే చూపించు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. కూతురును ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు మళ్లీ బయలుదేరారని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఆయన ఆదివారం నాడు మాట్లాడారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్డీఎ ప్రభుత్వం ఉండగా ఢిల్లీలో చక్రం తిప్పారని, ఆ రోజుల్లో వరి మద్దతు ధరను కేవలం రూ. 370 నుంచి రూ.530కి పెంచారని, ఇవాళ రైతుకు రుణమాఫీ అంటూ రోడ్ల మీదికి వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం రచ్చబండ పేరుతో వైయస్ రాజశేఖర రెడ్డి స్వప్నాన్ని భ్రష్టు పట్టిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం లేదని, ఇలా నిలబడి ప్రజా సమస్యలను అడిగే ధైర్యం అంతకన్నా లేదని, అందుకే మండల కేంద్రాల్లో, పట్టణాల్లో మాత్రమే రచ్చబండ నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఇవాళ్ల చేతగాని ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.

English summary
YSR Congress party president YS Jagan lashed out at TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X