వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ గురించి ఏమీ అడగొద్దు, కాంగ్రెస్‌లోనే:ద్వారంపూడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dwarampudi Chandrasekhar Reddy
కాకినాడ: కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురించి తనను ఏమీ అడగవద్దని కాకినాడ అర్బన్ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి బుధవారం అన్నారు. ద్వారంపూడి బుధవారం కాకినాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే తాను ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని చెప్పారు.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే తాను కాంగ్రెసులో కొనసాగాలని నిర్ణయించుకున్నానని, ముఖ్యమంత్రి కిరణ్ నాయకత్వంలో పని చేస్తానని చెప్పారు. తాను ఇక ఎప్పటికీ కాంగ్రెసు వాదిగానే ఉంటానన్నారు. మరోవైపు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ఈ రోజు ఢిల్లీలో తాను ప్రస్తుతానికి కాంగ్రెసు ఎంపీనని, జగన్ రమ్మన్నప్పుడు పార్టీ వీడతానని, అప్పటి వరకు పార్టీ ఆదేశాలు పాటిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

English summary
Kakinada MLA Dwarampudi Chandrasekhar Reddy announced that he is continued in Congress Party. He suggested media that do not ask any question about YS Jagan and his party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X