గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు అవిశ్వాసం అందుకోసం కాదు: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: తన వర్గం ఎమ్మెల్యేలకు, తనకు చిత్తశుద్ధి ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలోని ఓదార్పు యాత్రలో అన్నారు. రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టేది రైతుల కోసం కాదని ఉప ఎన్నికల కోసమే అని విమర్శించారు. అయినా రైతులకు మేలు జరుగుతుందంటే టిడిపి అవిశ్వాసానికి మద్దతు ఇస్తామన్నారు.

ధాన్యానికి మద్దతు ధర చూసి రైతులు పంట కోయడానికే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. తనను ఇరుకున పెట్టడానికే అవిశ్వాస తీర్మానమని, తన ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు. కాగా వైయస్ జగన్ తన ఓదార్పు సందర్భంగా కొన్ని గ్రామాల్లో పలు వైయస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు. ఓ గ్రామంలో వైయస్ఆర్ గుడిని ప్రారంభించారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy blamed TDP chief Nara Chandrababu Naidu on no confidential vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X