వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో చండోలియాకు బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

RK Chandolia
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో టెలికం మాజీ మంత్రి ఎ రాజా మాజీ ప్రైవేట్ కార్యదర్శి ఆర్‌కె చండోలియాకు సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. చండోలియా బెయిల్ పిటిషన్‌పై సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపి షైనీ బుధవారం నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచి, గురువారం వెలువరించారు. అభియోగాలు మోపిన తర్వాత కేసు విచారణకు తగిన సమయం తీసుకుంటుందని, తన సహనిందితులకు పై కోర్టులు బెయిల్ మంజూరు చేశాయని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని చండోలియా కోర్టు ముందు చెప్పుకున్నారు.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు, హైకోర్టు ఇప్పటికే 11 మంది నిందితులకు బెయిల్ మంజూరు చేశాయని, విచారణకు చాలా సమయం పడుతుందుని, వారితో సమానంగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. అప్పటి మంత్రి ఆదేశాలను మాత్రమే చండోలియా పాటించారని, చండోలియాపై ఆరోపణలు నిరాధారమైనవని ఆయన తరఫు న్యాయవాది కోర్టు ముందు చెప్పారు. స్వాన్ టెలికం ప్రమోటర్ షాహిద్ ఉస్మాన్ బాల్వాకు సిబిఐ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళి, తదితరులు ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు.

English summary
A CBI special court on Thursday granted bail to ex-telecom minister A Raja's former private secretary RK Chandolia, an accused in the 2G spectrum allocation scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X