వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వర్గం ఎమ్మెల్యే పిల్లి కూతురుపై కేసు నమోదు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
సంగారెడ్డి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉద్యోగాలిప్పిస్తామని ఆయన భార్య మోసం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తిన వివాదం సద్దుమణగక ముందే ఆయన కూతురు అరుణపై ఆరోపణలు ముందుకు వచ్చాయి. అరుణపై ఆమె సహవిద్యార్థిని సత్యవతి సంగారెడ్డి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసింది. అరుణ తనను మోసం చేసిందని మెదక్ జిల్లాకు చెందిన సత్యవతి ఆరోపించింది.

సత్యవతి పిటిషన్‌పై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అరుణపై కేసు నమోదు చేశారు. సత్యవతి ఫిర్యాదు ప్రకారం - అరుణ సత్యవతికి పది లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది. దాని కింద అరుణ 2.81 ఎకరాల భూమిని జిపిఎ చేయించుకుంది. ఆ భూమిని అరుణ 27 లక్షల రూపాయలకు విక్రయించుకుంది. సత్యవతి ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు అరుణపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

English summary
Police registered a case against YSR Congress president YS Jagan camp MLA Pilli Subhash Chandra Bose's daughter Aruna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X