హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పుడు బలం చూపించు: జగన్‌కు పయ్యావుల సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తన బలం నిరూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ శుక్రవారం ఓ చర్చా వేదికలో సవాల్ చేశారు. తమ పార్టీ అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టినందు వల్ల జగన్, టిఆర్ఎఎస్ పార్టీలు తమకు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సహకరించాలన్నారు. ప్రభుత్వాన్ని కాపాడటం కోసమే టిఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం అడ్డుకోవాలని చూస్తుందని విమర్శించారు. తెలంగాణ అంశంపై పేరుతో అవిశ్వాసం నుండి టిఆర్ఎస్ తప్పుకోవాలని చూడవద్దన్నారు. అవిశ్వాసం తీర్మానం చర్చలోనే తెలంగాణ అంశం ప్రస్తావించుకోవచ్చునని సూచించారు.

జగన్ కూడా ఇన్నాళ్లు తనకు 26 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పారని ఇప్పుడు తమ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించి బలం నిరూపించుకోవాలన్నారు. టిఆర్ఎస్, జగన్ వర్గం ఎమ్మెల్యేలు అందరూ కలిసి వస్తే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలక తప్పదన్నారు. కాగా ఇప్పటికే లోక్‌సత్తా, సిపిఐ, బిజెపి అవిశ్వాసానికి మద్దతిస్తామని ప్రకటించాయి.

English summary
TDP senior MLA Payyavula Keshav challenged YS Jaganmohan Reddy on no-confidence motion. He also suggested TRS to support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X