వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్వే చిల్లర రాజకీయాలు, ప్రలోభాలపై చెప్తా: బొత్స
తమకు జగన్ సలహాలు అవసరం లేదని ఆయన అన్నారు. ఎవరి మీద ఎప్పుడు వేటు వేయాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. శాసనసభ్యులను తాము ప్రలోభ పెట్టలేదని, వైయస్ జగనే ప్రలోభపెట్టారని ఆయన అన్నారు. ఎవరు ఏ పార్టీ ఉన్నారో అవిశ్వాస తీర్మానం వల్ల తేలిపోయిందని ఆయన అంతకు ముందు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం మంత్రులకు, నాయకులకు, శాసనసభ్యులకు విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ విందుకు బొత్స సత్యనారాయణ, చిరంజీవి, మంత్రులు, శాసనసభ్యులు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి, శాసనసభలో బలం నిరూపించుకున్నందుకు వారంతా ముఖ్యమంత్రిని అభినందించారు.
Comments
botsa satyanarayana pcc president ys jagan ysr congress బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడు వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు
English summary
PCC president Botsa Satyanarayana has lashed out at YSR Congress president YS Jagan.
Story first published: Tuesday, December 6, 2011, 19:37 [IST]