వైయస్ జగన్ సమర్థతపై స్పష్టత వచ్చింది: బొత్స
ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యుల కనుసన్నల్లోనే ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ శాసనసభ్యులు, ఆంధ్ర శానససభ్యులు, రాయలసీమ శానససభ్యులు అంటూ వేర్వేరుగా ఉండరని, అందరూ కాంగ్రెసు శాసనసభ్యులేనని, పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నప్పుడు పార్టీ శాసనసభ్యులుగా వ్యవహరించారని ఆయన అన్నారు. సభలో ఎత్తులకు పైయెత్తులు వేసినా తాము అవిశ్వాసాన్ని సమర్థంగా ఎదుర్కున్నామని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంపై విశ్వాసంతో కొంత మంది వెనక్కి వచ్చారని ఆయన అన్నారు. కొంత మంది శాసనసభ్యులు పార్టీకి చేసిన రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తాము దేనికి భయపడబోమని, ఎందుకు భయపడతామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. రైతులకు తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను చెప్పుకోవడానికి అవిశ్వాత తీర్మానం ప్రతిపాదన వల్ల అవకాశం లభించిందని ఆయన అన్నారు. చిరంజీవి మాటకు కట్టుబడి కాంగ్రెసు పార్టీ ప్రభుత్వానికి సహకరించారని ఆయన అన్నారు.