హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉపఎన్నికల్లో సత్తా చాటండి: సిఎంకు జగన్ వర్గం సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pilli Subhas Chandra Bose
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం ద్వారా అధికార కాంగ్రెసుకు షాక్ ఇచ్చిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. మంగళవారం జగన్‌తో భేటీకి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుర్నాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కిరణ్ తన సత్తా చాటాలని సవాల్ విసిరారు. బలం చూపించుకునేందుకు 2014 ఎన్నికల వరకు ఆగాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కడప ఎన్నిక ఫలితాలే పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

తాము అన్నింటికి సిద్ధపడే తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చామని మరో ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఉప ఎన్నికల్లో మా సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పారు. అవిశ్వాసం ఎవరు పెట్టారనే అంశంతో మాకు సంబంధం లేదని ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వంతోనే తాము విభేదిస్తున్నామన్నారు.

English summary
YSR Congress Party MLAs challenged CM Kiran Kumar Reddy about bypole. They hoped that Kadapa results will repeat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X