హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విజయమ్మపై దాడి బాధాకరం: కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం చెందినప్పుడు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిఎం కావాలని సంతకాలు సేకరించింది పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కాదా అని జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ మంగళవారం ప్రశ్నించారు. అప్పుడు సంతకాలు సేకరించిన వారే ఇప్పుడు దానిని జగన్‌పైకి నెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. అసెంబ్లీలో వైయస్ విజయమ్మపై అధికార, ప్రతిపక్షాలు దాడి చేయడం శోచనీయమన్నారు. బోత్స వ్యాఖ్యలు రాజకీయ దిగజారుడుతన్నారు.

తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని కానీ వారు మాత్రం చివరి వరకు ఒక్కత్రాటిపై నిలబడ్డారన్నారు. అనర్హతకు తాము భయపడేది లేదని తెలిసే తాము విప్ ధిక్కరించి ఓటు వేశామన్నారు. తమ అనర్హతపై తాత్సారం చేస్తారని తాము భావించడం లేదన్నారు. తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెసు పార్టీ నేతలు దుష్ర్పచారం కూడా చేశారన్నారు.

తాము దేనికైనా సిద్ధపడి వేటు వేస్తారని తెలిసే అవిశ్వాసానికి మద్దతు తెలిపామని మరో ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఉప ఎన్నికలు వస్తే కడప ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. తాము రైతు సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చి మద్దతిచ్చామన్నారు. ప్రభుత్వం గ్రామాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి లేదన్నారు.

English summary
Jagan camp MLA Konda Surekha fired at pcc chief Botsa Satyanarayana today. She accused Botsa for signature collection when ys died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X