హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వం నన్ను బెదిరించింది: జగన్ ఎమ్మెల్యే సుచరిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: అధికార కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానం విషయంలో తనను బెదిరింపులకు గురి చేసిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే మేకతోటి సుచరిత మంగళవారం మీడియాతో అన్నారు. తన భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని ప్రభుత్వానికి అనుకూలాంగా ఓటు వేయకుంటే ఆయనను అండమాన్ దీవులకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని బెదిరించారన్నారు. తనను ప్రలోభాలకు కూడా గురి చేసిందని కాంగ్రెసు ప్రలోభాలకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. దివంగత వైయస్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళతామన్నారు.

ఇన్నాళ్లూ వైయస్ జగన్‌తో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెసు దారి పట్టారని అది సరికాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు వేరుగా మీడియాతో అన్నారు. జగన్ నుండి వెనక్కి వెళ్లిన సుమారు పదిమంది ఎమ్మెల్యేలు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చలువతో శాసనసభ్యుడిగా గెలిచిన చంద్రశేఖర రెడ్డి ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. విప్ ధిక్కరించి 16 మంది ఎమ్మెల్యేలు జగన్ వెంట రావడం చారిత్రాత్మకమన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp MLA Sucharitha said that Congress warned her about no-confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X