వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రం విడిపోవాలంటే ఏకాభిప్రాయం అవసరం: జితేంద్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jitendra Singh
న్యూఢిల్లీ: ఒక రాష్ట్రం విడిపోవాలంటే విధిగా ఏకాభిప్రాయం అవసరమని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం అన్నట్లుగా సమాచారం. రాజ్యసభలో బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగుగా చేయాలని డిమాండ్ చేశారు. అందుకోసం యుపి అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిందని చెప్పారు. దీనిపై జితేంద్ర సింగ్ స్పందిస్తూ ఏకాభిప్రాయ సాధనతోనే కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరుగుతుందని ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రాలు విడిపోతే అనేక పరిణామాలు ఉండాయని ఆయన అభిప్రాయపడ్డారు. విడగొట్టేందుకు విధిగా ఏకాభిప్రాయం కావాల్సిందేనని చెప్పారు.

కాగా ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలకు మరో ఆరు నెలలు ఉండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రాన్ని నాలుగుగా విడగొట్టాలని డిమాండ్ చేయడం, అందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించని మాయావతి ఆ అంశం నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఎత్తుగడ వేశారనేది బిజెపి, కాంగ్రెసు, ఎస్పీల వాదన.

English summary
Union Minister Jitendra Singh said today in Rajyasabha that consensus is must for divide one state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X