హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాయా బజారును తలపిస్తోంది: బొత్స, సిఎంపై టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలపై తెలుగుదేశం పార్టీ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకు పడింది. బడ్జెట్ భారీగా ప్రకటించడం ఖర్చు తక్కువ చేయడం కాంగ్రెసుకు అలవాటేనని విమర్శించారు. రాష్ట్రంలో పాలన మాయాబజారును తలపిస్తోందన్నారు. వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణకు క్లీన్ చిట్ రాలేదని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత సోనియా గాంధీతో సహా కాంగ్రెసు పార్టీ నేతలంతా జైలుకు వెళ్లే వారేనని అన్నారు.

కిరాయికి తెప్పించుకొని పొగిడించుకోవడం సిఎంకు అలవాటుగా మారిందని పార్టీ నేత బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సిఎంకు రైతు సమస్యల పైనే కాదు కనీసం రాష్ట్ర సమస్యల పైన కూడా ఏమాత్రం అవగాహన లేదన్నారు. సిఎం శాడిస్టులా వ్యవహరిస్తున్నారని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అప్పులేని రైతును చూపించాలని ఆయన సవాల్ విసిరారు. రైతు కమిషన్ వేస్తానన్న సిఎం మరో భేతాళ కథ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఆదర్శ రైతులందా రౌడీలు, కాంగ్రెసు కార్యకర్తలు, ఆటో డ్రైవర్లేనని విమర్శించారు.

English summary
TDP leader Gali Muddukrishna Naidu and Buchaiah Chowdary fired at PCC chief Botsa Satyanarayana and CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X