జూ.ఎన్టీఆర్ను పరిచయం చేసిన ఎంఎస్ రెడ్డి కన్నుమూత
ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఎంఎస్ రెడ్డి తనయుడు. తలంబ్రాలు, అంకుశం, ఆగ్రహం, ఆహుతి, అమ్మోరు, బాల రామాయణం, అరుంధతి, పల్నాటి సింహం, ఏకలవ్య వంటి పలు హిట్ చిత్రాలను ఇతను అందించారు. నిర్మాతగా మొదటి చిత్రం భార్య. రాజశేఖర్ ప్రధాన పాత్ర పోషించిన అంకుశం చిత్రంలో ఎంఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా కనిపించారు. బాల రామాయణం చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ను తెలుగు తెరకు పరిచయం చేశారు. నలభై ఏళ్లు సినీ పరిశ్రమకు ఈయన సేవలు అందించారు. రామాయణం చిత్రంతో జాతీయ పురస్కారం అందుకున్నారు.
ఎంఎస్ రెడ్డి మృతి వార్త తెలిసిన ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ సినీ పరిశ్రమ భీష్మ పితామహుడిని కోల్పోయిందన్నారు. ఉదయాన్నే బాధాకరమైన వార్త వినవలసి వచ్చిందన్నారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆయన మృతి వార్త విని విషాదంలో మునిగి పోయారు.