వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు లెక్కలు తెలియకపోతే చెప్తా: మంత్రి పితాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pithani Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి లెక్కలు రాకుంటే తాను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి పితాని సత్యనారాయణ సోమవారం అన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయంలో జగన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుసుకోకుండా అలా మాట్లాడటం సరికాదన్నారు. ఫీజు బకాయిలు ఉన్నాయనేది శుద్ద అబద్దం అన్నారు.

రాష్ట్రంలో పదమూడు లక్షల దరఖాస్తులు ఇప్పటికే రెన్యూవల్ అయ్యాయని, మరో పది లక్షల ఉపకార వేతనాల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాప్యం చేయడం లేదన్నారు. కాగా కిరణ్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు చెల్లింపులు జరగటం లేదని జగన్, ఆయన వర్గం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Minister Pithani Satyanarayana said that he is ready to teach YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X