వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిఏ చైర్ పర్సన్ సోనియాకు వైయస్ భిక్ష: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ys jagan
గుంటూరు: యుపిఏ చైర్ పర్సన్ పదవి సోనియా గాంధీకి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్షేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తన గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు కుళ్లు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ఉద్దేశ్య పూర్వకంగా తనపై కోర్టులో కేసు వేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన వైయస్ పైన, ఆయన కుటుంబం పైన కాంగ్రెసు అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.

తనపై కాంగ్రెసు, టిడిపి కలిసి చేస్తున్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలంతా తన వైపే ఉన్నారని చెప్పారు. ప్రజలు నిత్యం ఇబ్బందులతో సతమతమవుతున్నా అధికార పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ప్రతిపక్షం కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. దివంగత వైయస్ పెట్టిన పలు పథకాలను కిరణ్ ప్రభుత్వం ఆపి వేస్తుందని ఆరోపించారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy said that Sonia Gandhi get UPA chairman with late YSR support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X