హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి, కోనేరులకు 29వరకు రిమాండ్, ఐటి పిల్ వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Koneru Prasad
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్‌కు సిబిఐ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ పొడిగించింది. గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు కోనేరును విచారించింది. నాపై నా కుటుంబం ఆధారపడి ఉందని, తాను హార్ట్ పేషెంటునని దయచేసి తనకు బెయిల్ ఇప్పించాలని జడ్జిని కోనేరు వేడుకున్నారు. తాను అక్రమాలకు పాల్పడ్డానని తనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అలాగే ఎమ్మార్‌లో తాను ప్రత్యక్షంగా పాల్గొన్న ఆధారాలు లేవని చెప్పారు. అనంతరం కోనేరు రిమాండును 29 వరకు పొడిగించింది.

ఓఎంసిలో అరెస్టైన గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల రిమాండును కూడా కోర్టు 29 వరకు పొడిగించింది. కాగా అరెస్టు సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి ఇంట్లో దొరికిన నాలుగున్నర కోట్ల రూపాయలను తమకు అప్పగించాలన్న ఆదాయపన్ను శాఖ పిటిషన్‌పై విచారణను జనవరి నాలుగో తేదికి వాయిదా వేసింది.

English summary
CBI special court extended Koneru Prasad and Gali Janardhan Reddy remand till 29th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X