వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి ట్రస్టుపై విమర్శలు: రాజశేఖర్, జీవితకు సమన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jeevitha and Rajasekhar
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వేసిన పరువు నష్టం దావా కేసులో హీరో రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. రాజశేఖర్, జీవిత వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదిలోగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. అల్లు అరవింద్ ఈ ఏడాది మార్చి 3వ తారీఖున రాజశేఖర్ దంపతులపై కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. అప్పటి నుండి ఆయన పలుమార్లు కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. మూడు రోజుల క్రితమే వాంగ్మూలం ఇచ్చిన అల్లు గురువారం మరోసారి హాజరయ్యారు.

కాగా రెండేళ్ల క్రితం 2009 ఆగస్టు నెలలో రాజశేఖర్, జీవితలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు అల్లు అరవింద్ పైన అనేక విమర్శలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పలు టీవీ ఛానళ్లలో వారు చిరంజీవిపై వ్యక్తిగతంగానూ అనేక విమర్శలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌పై తప్పుడు ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించారని అల్లు అరవింద్ పిటిషన్ వేశారు.

English summary
Nampally court issued summons to Rajasekhar and Jeevitha in Allu Aravind case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X